Share News

Village Secretariats: సచివాలయాలపై మూడంచెల్లో పర్యవేక్షణ

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:02 AM

గ్రామ/వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాల దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు...

Village Secretariats: సచివాలయాలపై మూడంచెల్లో పర్యవేక్షణ

  • 2,778 పోస్టులు మంజూరు

అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాల దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన గ్రామ/వార్డు సచివాలయాల శాఖ.. తాజాగా మండల, మున్సిపల్‌, జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. డిప్యుటేషన్‌/ఔట్‌సోర్సింగ్‌ ద్వారా 2,778 పోస్టులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా మండలాలు/పట్టణ స్థానిక సంస్థల నుంచి 1,785 మందిని డిప్యుటేషన్‌పై వినియోగించుకోనున్నారు. 993 కొత్త ఏఎన్‌ఎం/వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను సృష్టించనున్నారు.

నియామకాలు.. పర్యవేక్షణ ఇలా..

  • గ్రామ/వార్డు సచివాలయాల శాఖ నుంచి ఆరుగురిని, డైరెక్టరేట్‌ నుంచి ఆరుగురిని డిప్యుటేషన్‌పై ఫంక్షనల్‌ అసిస్టెంట్లుగా తీసుకుంటారు.

  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి 17 మంది జాయింట్‌ డైరెక్టర్‌/డీఎల్‌డీఏ స్థాయి అధికారులను జిల్లా గ్రామ/వార్డు సచివాలయ శాఖ అధికారిగా నియమిస్తారు. ఆ శాఖల నుంచి 26 మంది సూపరింటెండెంట్లు, 26 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 52 మంది టెక్నికల్‌ కోఆర్డినేటర్లు, 104 మంది జూనియర్‌ అసిస్టెంట్లను డిప్యుటేషన్‌పై తీసుకుంటారు. 26 మంది ఆఫీసు సబార్డినేట్లను ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమిస్తారు.

  • మండల స్థాయిలో పంచాయతీరాజ్‌శాఖ ఫస్ట్‌ లెవల్‌ గెజిటెడ్‌ అధికారిని మండల గ్రామ/వార్డు సచివాలయ అధికారిగా నియమిస్తారు. ఇందుకోసం 660 మందిని డిప్యుటేషన్‌పై తీసుకుంటారు. మండలాల్లో 1,320 మంది జూనియర్‌ అసిస్టెంట్లను ఇదే శాఖ నుంచి డిప్యుటేషన్‌పై నియమిస్తారు.

  • అదే విధంగా పురపాలక శాఖకు చెందిన ఇద్దరు రీజినల్‌ డైరెక్టర్‌ కమ్‌ అప్పిలేట్‌ కమిషనర్లు, ఆరుగురు సెలెక్షన్‌ గ్రేడ్‌/జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులను అదనపు కమిషనర్లుగా.. మరో 9 మందిని జిల్లా గ్రామ/వార్డు సచివాలయ శాఖ అధికారులుగా డిప్యుటేషన్‌పై నియమిస్తారు.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 05:02 AM