CM Chandrababu Naidu: ప్రతిభ, అవకాశాలకు కేంద్రంగా ఏపీ
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:04 AM
ప్రతిభ, అవకాశాలకు కేంద్రంగా ఏపీ ఆవిర్భవిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.
లింక్డ్ఇన్ నివేదికపై సీఎం చంద్రబాబు హర్షం
న్యూఢిల్లీ/అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రతిభ, అవకాశాలకు కేంద్రంగా ఏపీ ఆవిర్భవిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. లింక్డ్ఇన్ తొలిసారి ‘సిటీస్ ఆన్ ది రైజ్-2025’ పేరుతో రూపొందించిన నివేదికలో.. ఉద్యోగాల కల్పన అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం, విజయవాడ మొదటి, మూడో స్థానాలను దక్కించుకోవడంపై ఆయన ‘ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ర్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో కూడిన నూతన పారిశ్రామిక విధానాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో క్యాంప్సలు ఏర్పాటు చేయడం, క్వాంటమ్ వ్యాలీ, ఏఐ వర్సిటీ వంటివి ప్రారంభం కానుండటంతో దేశానికి ఐటీ హబ్గా ఏపీ నిలువనుందని చంద్రబాబు వెల్లడించారు.