Pawan Kalyan: వారు సమాజానికి అత్యంత ప్రమాదకరం.. ప్లానెట్ కిల్లర్స్ బాగుంది: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:03 AM
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీపై ప్రశంసలు కురిపించారు. అడవిలో జరుగుతున్న దురాగతాలను ఈ డాక్యుమెంటరీ సమగ్రంగా వివరించిందని పేర్కొన్నారు.
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీపై ప్రశంసలు కురిపించారు. అడవిలో జరుగుతున్న దురాగతాలను ఈ డాక్యుమెంటరీ సమగ్రంగా వివరించిందని పేర్కొన్నారు. శేషాచలం అడవిని ఎలా నాశనం చేశారో అసాధారణంగా వివరించిందని, ఎర్రచందనం చెట్లను నరికి, అక్రమంగా రవాణా చేయడాన్ని ఎత్తి చూపిందని పేర్కొన్నారు (Red sandal smuggling).
'ఎర్రచందనం మాఫియా వెనుక ఉన్న అంతర్జాతీయ కింగ్పిన్లను, జరిగిన క్రూరమైన హింసను, ఈ ప్రక్రియలో మనం కోల్పోయిన అటవీ అమరవీరులను ఈ డాక్యుమెంటరీ బహిర్గతం చేసింది. రాజకీయ ముసుగులు వేసుకుని ఎర్రచందనం నెట్వర్క్లో దాక్కున్న నేరస్థులు సమాజానికి అత్యంత ప్రమాదకరమైనవారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి' అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు (AP Deputy CM statement).
స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన కొందరు రాజకీయ నాయకులు ఎర్రచందనం అక్రమ రవాణాను తమ రాజకీయ కెరీర్కు ఇంధనంగా మార్చుకున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు (red sandalwood smuggling AP). ఈ వాస్తవాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చి, శేషాచలం అడవిలో జరిగిన క్రూరమైన విధ్వంసాన్ని చూపించినందుకు డాక్యుమెంటరీ రూపకర్తలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
ఆర్ఐ సతీష్ కుమార్ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ
Read Latest AP News And Telugu News