Share News

ED petition: మద్యం స్కాంలో ఈడీ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

ABN , Publish Date - May 17 , 2025 | 04:37 AM

మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ED petition: మద్యం స్కాంలో ఈడీ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

విజయవాడ, మే 16(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ఈడీ దాఖలుచేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆయన నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి అనుమతివ్వాలని ఈడీ తరఫు న్యాయవాది జయప్రకాశ్‌ గురువారం ఈ పిటిషన్‌ వేయగా.. సాంకేతిక కారణాలతో న్యాయాధికారి పి.భాస్కరరావు తిరస్కరించారు. దీంతో శుక్రవారం ఉదయం మళ్లీ వ్యాజ్యం దాఖలు చేశారు. పరిశీలించిన న్యాయాధికారి రాజశేఖర్‌రెడ్డికి నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:37 AM