వాళ్ల బాధలు తీరేదెప్పుడు...
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:55 PM
అనకాపల్లి జిల్లా: గిరిజనులకు డోలా మోదతు తప్పడం లేదు. తాజాగా ఓ గర్భిణీని డోలీపై మోసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం, చింతలపూడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రతిరోజూ ఏదో ఒక సమస్యతో డోలీపై వెళుతున్నామని గిరిజనులు తెలిపారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా: గిరిజనులకు డోలా మోదతు తప్పడం లేదు. తాజాగా ఓ గర్భిణీని డోలీపై మోసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం, చింతలపూడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రతిరోజూ ఏదో ఒక సమస్యతో డోలీపై వెళుతున్నామని గిరిజనులు తెలిపారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రోడ్డును వెంటనే పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.
ఈ గిరిజనుల డోలీ కష్టాలు చూస్తే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. నిన్న (సోమవారం) ఉదయం ఓ గిరిజన గర్భిణీ స్త్రీకి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు తగిన సదుపాయం లేకపోవడంతో డోలీ మోతే వారికి శరణ్యమైంది. గ్రామస్తులు కలిసి ఆమెను సుమారు మూడు కి.మీ. మేర వరదనీరు, గుంటలు, బురద రోడ్లులో మోసుకువెళ్లారు. స్కూలు పిల్లలే కాదు.. కనీసం నిత్యావసర వస్తులు కూడా తీసుకునేందుకు ఎటువంటి రోడ్డు మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య చాలా ఏళ్లుగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రోడ్డు మార్గం వేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలి.. వీడియోలు వైరల్..
శ్రీ చైతన్య గర్ల్స్ క్యాంపస్లో ఆందోళన
ర్టీపీపీ దగ్గర మరోసారి ఉద్రిక్తత..
పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 03 , 2024 | 12:55 PM