దొంగకు పులిహోర తినిపించిన యువకులు
ABN, Publish Date - Sep 18 , 2024 | 12:18 PM
నల్గొండ జిల్లా: ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను స్థానిక యువకులు పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. నల్గొండ జిల్లా, నార్కెట్పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో పోగల గణేష్ అనే వ్యక్తి చోరీలకు పాల్పడ్డాడు.
నల్గొండ జిల్లా: ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను స్థానిక యువకులు పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. నల్గొండ జిల్లా, నార్కెట్పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో పోగల గణేష్ అనే వ్యక్తి చోరీలకు పాల్పడ్డాడు. తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో దొంగను పట్టుకునేందుకు స్థానిక యువకులు మాటు వేశారు. సోమవారం రాత్రి దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం స్తంభానికి కట్టేశారు.
అయితే తనకు ఆకలి వేస్తుందని దొంగ చెప్పగా అక్కడ వినాయకుడికి సమర్పించిన పలహారాల్లో పులిహోర తీసుకువచ్చి ఓ యువకుడు స్వయంగా తినిపించాడు. తర్వాత మంచినీరు కూడా తాగించారు. కొంతమంది యువకులు ఆ దొంగను పలు వివరాలు అడిగి తెలుసుకోగా గతంలో ఆలయాల్లో హుండిల్లో డబ్బులు మాత్రమే దొంగిలించేవాడినని తెలిపాడు. అనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు. కాగా దొంగకు పులిహోర తినిపించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న నిమర్జనం..
పరిశ్రమల ఏర్పాటుపై సీఎం కీలక ప్రకటన..
సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు: రంగనాథ్
జగన్కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 18 , 2024 | 12:18 PM