కేబీఆర్ పార్కు వద్ద భూమిలోంచి పొగలు..
ABN, Publish Date - Sep 06 , 2024 | 10:43 AM
హైదరాబాద్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. భూమిలో నుంచి పొగలు రావడం కలకలం రేగింది. భూమిలో నుంచి పొగలు రావడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. భూమిలో నుంచి పొగలు రావడం కలకలం రేగింది. భూమిలో నుంచి పొగలు రావడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భూగర్భంలో ఉన్న కేబుల్ వైర్లు షార్ట్సర్క్యూట్ కావడంతో పొగలు రావచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురువారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది.
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బంజారాహిల్స్ నుంచి జూబ్లీ హిల్స్కు వేళ్లే మార్గంలో అండర్ గ్రౌండ్లో పలు కేబుల్స్, ట్రాన్స్కోకు సంబంధించి వైర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూ గర్భం నుంచి పొగలు రావడంతో షార్టు సర్క్యూట్ జిరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించిన తర్వాత షార్ట సర్క్యూట్ జరిగి ఉంటుందని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బుడమేరును మింగేసిన వైసీపీ నాయకులు..
సజ్జలను అరెస్టు చేస్తే.. అన్నీ బయటకొస్తాయి ..
టీడీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
YCP: అధ్యక్ష బాధ్యతలా.. మాకొద్దు బాబోయ్..
కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ కౌంటర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 06 , 2024 | 10:46 AM