దొంగతనాల గుట్టు రట్టు కావడంతో..

ABN, Publish Date - Nov 27 , 2024 | 12:45 PM

సంగారెడ్డి జిల్లా: వాహనాలను చోరీ చేస్తున్న యువకుడు తన గుట్టు రట్టవడంతో వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా, చింతకుంట శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటో, ట్రాక్టర్లను శ్యామ్ అనే యువకుడు చోరీ చేశాడు.

సంగారెడ్డి జిల్లా: వాహనాలను చోరీ చేస్తున్న యువకుడు తన గుట్టు రట్టవడంతో వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా, చింతకుంట శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటో, ట్రాక్టర్లను శ్యామ్ అనే యువకుడు చోరీ చేశాడు. అయితే భజరంగపేట గ్రామస్తులు తనను గుర్తించారని తెలుసుకున్న యువకుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తల్లిని తీసుకుని భజరంగపేట గ్రామానికి వెళ్లే క్రమంలో మంజీర వంతెన వద్ద బైక్ ఆపి వాగులోకి దూకాడు. కొడుకును రక్షించుకునే క్రమంలో తల్లి కూడా నీటిలోకి దూకేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతన్న బెయిల్ ఫిటిషన్ వాయిదా..

వాదంలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక

హైడ్రా రంగనాథ్‌కు బక్క జడ్సన్ సవాల్..

విజయపాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 27 , 2024 | 12:46 PM