సైబర్ నేరగాళ్ల ఉచ్చులో విశ్రాంత ఉద్యోగి..

ABN, Publish Date - Dec 08 , 2024 | 12:47 PM

ఖమ్మం జిల్లా: వైరాలో విశ్రాంత ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఉటుకూరి నరసింహరావు అనే వ్యక్తి రూ. 15 లక్షలు చేజేతులా తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత బంధువులకు తెలియడంతో వెంటనే వైరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఖమ్మం జిల్లా: వైరాలో విశ్రాంత ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఉటుకూరి నరసింహరావు అనే వ్యక్తి రూ. 15 లక్షలు చేజేతులా తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత బంధువులకు తెలియడంతో వెంటనే వైరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైరాలో నివాసం ఉంటున్న నరసింహరావుకు శుక్రవారం మధ్యాహ్నం వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చింది. నరసింహరావు దగ్గర హవాలా డబ్బు ఉందని, మోసతో వ్యాపారం చేస్తున్నారని బెదిరించారు.


సుప్రీం కోర్టు నుంచి సమన్లు వచ్చాయని అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే.. రూ. 15 లక్షలు సుప్రీంకోర్టు ఆడిట్ విభాగానికి జమ చేయాలని భయపెట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతే వెంటనే అరెస్టు చేస్తామన్నారు. దీంతో నరసింహరావు భయపడి రూ. 15 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్సార్‌సీపీ పాపాల చిట్టా రెడి..

సీఆర్డీయేలో లంచాల బోగోతం..

బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్

బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 08 , 2024 | 12:47 PM