బయట ఫుడ్ తినాలంటే భయపడుతున్న జనాలు..
ABN, Publish Date - Dec 08 , 2024 | 01:07 PM
హైదరాబాద్: నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లు నాణ్యతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆహార పదార్ధాల్లో బొద్దింకలు, టాబ్లట్లు, ఇనుప ముక్కలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారుల నిర్లక్ష్యంతో బయట ఫుడ్ తినాలంటేనే నగర వాసులు భయపడాల్సి వస్తోంది.
హైదరాబాద్: నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లు నాణ్యతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆహార పదార్ధాల్లో బొద్దింకలు, టాబ్లట్లు, ఇనుప ముక్కలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారుల నిర్లక్ష్యంతో బయట ఫుడ్ తినాలంటేనే నగర వాసులు భయపడాల్సి వస్తోంది. పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతున్నా.. కఠిన చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ ఎనలేని ఉదాసీనత ప్రదర్శిస్తోంది.
కల్తీ ఆహారానికి భాగ్యనగరం కేరాఫ్ అడ్రస్గా మారింది. జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తుండడంతో హోటల్స్ నిర్వాహకుల తీరు మారడంలేదు. ఒకే రోజు రెండు ప్రముఖ రెస్టారెంట్లలో కల్తీ నిర్వాకం బయటపడింది. ఓ హోటల్లోని ఆలు కర్రీలో ఇనుపముక్కలు రాగా బావార్చీ దమ్ బిర్యానీలో టాబ్లెట్స్ దర్శనమిచ్చాయి. ఈ రెండు ఘటనలు మరువకముందే మరో ప్రముఖ హోటల్ లోని టిఫిన్లో జెర్రీ ప్రత్యక్షమైంది. అంతకుముందు పలు హోటళ్లలోని బిర్యానీల్లో బొద్దింకలు, సిగరెట్ పీకలు, జెర్రిలు కనిపించాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయసాయి బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తే, భయపడతారా..
వైఎస్సార్సీపీ పాపాల చిట్టా రెడి..
బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్పై మావోయిస్టుల దాడి
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 08 , 2024 | 01:10 PM