కాకినాడ డీప్ వాటర్ పోర్టులో తనిఖీలు
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:32 PM
కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న 146 కంటైనర్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు కాకినాడ పోర్టు అడ్డగా మారడంతో..
కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న 146 కంటైనర్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు కాకినాడ పోర్టు అడ్డగా మారడంతో.. ఇప్పుడు వెళుతున్నకంటైనర్లలో రేషన్ బియ్యం ఏమైనా ఉన్నాయా.. అన్న కోణంలో అధికారులు సోదాలు చేస్తున్నారు.
కాకినాడలో రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా రవాణా అవుతున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం సౌత్ ఆఫ్రికాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న షిప్ను అధికారులు తనిఖీలు చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగా తాజాగా కాకినాడ డీప్ వాటర్ పోర్టులో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయన్న సమాచారంతో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్, పోర్టు అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆయన దేశం మొత్తం గర్వించే నాయకుడు: పవన్ కల్యాణ్
సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటన
బాలకృష్ణ, జానారెడ్డిలకు బిగ్ షాక్..
తల్లికి సాయం, తండ్రికి స్నేహం. అన్నదమ్ములకు ఆసరా
మహానందిలో చిరుతపులి సంచారం కలకలం..
అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 15 , 2024 | 01:32 PM