మదనపల్లె కేసులో కొత్త ట్విస్ట్..

ABN, Publish Date - Jul 30 , 2024 | 11:20 AM

చిత్తూరు జిల్లా: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ఇద్దరు ఆర్డీవోలు, ఒక సీనియర్ అసిస్టెంట్‌ను అధికారులు సస్సెండ్ చేశారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

చిత్తూరు జిల్లా: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ఇద్దరు ఆర్డీవోలు, ఒక సీనియర్ అసిస్టెంట్‌ను అధికారులు సస్సెండ్ చేశారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మదనపల్లె ఆర్డీవోగా పనిచేసిన మురళీ ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌లను సస్పెండ్ చేసింది. ఇదే కేసులో ఇటీవల మదనపల్లె వన్ టౌన్ సీఐను వీఆర్‌కు పంపి.. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. ఇక మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సందర్శించారు. ప్రస్తుతం తమ అదుపులో అనుమానితులు ఎవరూ లేరని కోయ ప్రవీణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రం నిధులు ఇస్తే జగన్‌ ఏం చేశారు?..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో కీలక మలుపు..

తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడి వేడిగా చర్చ..

సభలో ఎమోషనల్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 30 , 2024 | 11:20 AM