కృతుంగా బిర్యానీలో బొద్దింక.. హోటల్ సిబ్బంది నిర్లక్ష్య సమాధానం

ABN, Publish Date - Dec 04 , 2024 | 10:04 PM

హైదరాబాద్ నగరంలో బిర్యానీ తిందామని రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కస్టమర్‌కు షాకింగ్ ఘటన ఎదురైంది. కొత్తపేటలోని కృతుంగా రెస్టారెంట్‌లో సందీప్ అనే వ్యక్తి బిర్యానీ ఆర్డర్ చేశారు. ఆ బిర్యానీలో బొద్దింక చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెద్ద హోటల్ అని వస్తే.. బిర్యానీలో బొద్దింక రావడంతో ఆందోళనకు గురయ్యాడు.

హైదరాబాద్ నగరంలో బిర్యానీ తిందామని రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కస్టమర్‌కు షాకింగ్ ఘటన ఎదురైంది. కొత్తపేటలోని కృతుంగా రెస్టారెంట్‌లో సందీప్ అనే వ్యక్తి బిర్యానీ ఆర్డర్ చేశారు. ఆ బిర్యానీలో బొద్దింక చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెద్ద హోటల్ అని వస్తే.. బిర్యానీలో బొద్దింక రావడంతో ఆందోళనకు గురయ్యాడు.


ఇదేంటని హోటల్ సిబ్బందని ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో కస్టమర్లంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్‌లోని కిచెన్ దుర్గందం వస్తుందని.. చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను సందీప్ కోరారు.

Updated at - Dec 04 , 2024 | 10:04 PM