కేరళ వరదల బీభత్సం ..19 మంది మృతి
ABN, Publish Date - Jul 30 , 2024 | 11:53 AM
కేరళ: వాయనాడ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కేరళ: వాయనాడ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వందలాది మంది మట్టిదిబ్బలకింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మట్టిదిబ్బలను తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.
ముండకైలో అర్ధరాత్రి ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారు జామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక నివాసాలు ధ్వంస మయ్యాయి. 4 వందలకు పైగా కుటుంబాలపై ఆప్రభావం పడిందవి. చాలా మంది ఆచూకి తెలియరావడంలేదని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాంపు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ ( NDRF), కేఎస్డీఆర్ఎఫ్ (KSDRF) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రం నిధులు ఇస్తే జగన్ ఏం చేశారు?..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో కీలక మలుపు..
తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడి వేడిగా చర్చ..
సభలో ఎమోషనల్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jul 30 , 2024 | 11:56 AM