గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక..!

ABN, Publish Date - Jul 19 , 2024 | 11:07 AM

రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఇది 10.30 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజి 175ను స్వల్పంగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 3.20 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువకు విడుదల చేశారు.

రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఇది 10.30 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజి 175ను స్వల్పంగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 3.20 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువకు విడుదల చేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. అయితే దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల కోనసీమకు వరద ఉధృతి తాకింది. పి. గన్నవరం మండలం, గంటిపేట కూడువద్ద వేసిన తాత్కాలిక గట్టు వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో నాలుగు లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మార్కు రాజకీయం..

నీట్‌పై సుప్రీం కీలక ఆదేశాలు..

ఇంద్రకీలాద్రిలో శాకంబరీ ఉత్సవాలు...

మోదీకి లేఖ రాసిన జగన్..

రైతులను నిండా ముంచిన జగన్ సర్కార్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 19 , 2024 | 11:07 AM