తెలంగాణలో ధరణి పరిస్థితి ఇది..

ABN, Publish Date - Aug 15 , 2024 | 08:47 AM

హైదరాబాద్: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లు తెలంగాణలో ధరణి పరిస్థితి ఉంది. కొత్త చట్టం తీసుకువచ్చి సమస్యలు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నా..పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించకపోవడంతో ప్రభుత్వానికి జిల్లాల కలెక్టర్లు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు.

హైదరాబాద్: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లు తెలంగాణలో ధరణి పరిస్థితి ఉంది. కొత్త చట్టం తీసుకువచ్చి సమస్యలు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నా..పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించకపోవడంతో ప్రభుత్వానికి జిల్లాల కలెక్టర్లు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తామంటున్న భూమాత పోర్టల్ సంగతి దేవుడెరుగు.. ఇప్పుడున్న ధరణిలో పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరిస్తే చాలని దరఖాస్తుదారులు అంటున్నారు. ఈ క్రమంలో ధరణిపై ఆరోపణలు వినిపిస్తుండగా ఎకరానికి ఇంత ధర అని ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకువచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా సులభంగా భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నీరుగారుతున్నాయి. ప్రభుత్వం మారి 9 నెలలు అవుతున్నా.. ధరణి సమస్యలు ఎక్కడావి అక్కడే అన్నట్లు పడి ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీలో 58 మంది ఉద్యోగులకు నోటీసులు

కన్నతండ్రే కాలయముడు

మహిళలకు... అదే అసలైన స్వాతంత్య్రం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 15 , 2024 | 08:47 AM