బయటపడుతున్న ధరణి భూ బాగోతం

ABN, Publish Date - May 30 , 2024 | 10:02 AM

హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి భూబాగోతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ధరణిలోని లొసుగులను అడ్డుపెట్టుకుని నగర శివార్లలో నకిలీ పత్రాలతో దాదాపు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసిన వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి భూబాగోతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ధరణిలోని లొసుగులను అడ్డుపెట్టుకుని నగర శివార్లలో నకిలీ పత్రాలతో దాదాపు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసిన వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అధికారులు, బడా నేతల ఆశీస్సులతో విలువైన ప్రభుత్వ భూములకు ఓ రాజకీయ నాయకుడి కుమారుడి పేరు మీద పట్టాదారు పాస్‌బుక్‌లు పొందారు. గత ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారం ఇటీవల బయటకు పొక్కడంతో అధికారులు అన్ని ఆధారాలతో దీనిపై లోతుగా విచారించారు. అక్రమార్కులకు చెక్‌పెట్టి భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పాస్‌బుక్‌లను రద్దు చేయడంతోపాటు నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే సీఎం నెంబర్ ఇచ్చా: రాజాసింగ్

సర్వేల అలజడి.. వైసీపీ నేతల్లో టెన్షన్..

జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్

111 స్థానాల ఫలితాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 30 , 2024 | 10:03 AM