ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. రాహుల్తో భేటీ..!
ABN, Publish Date - Jul 02 , 2024 | 09:12 AM
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేబినెట్లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ లోపే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేబినెట్లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ లోపే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా 5వ తేదీలోపే జరుగుతుందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్తో సమావేశం కావడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి మంగళవారం లేదా బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీకి కొత్త చీఫ్ నియామకంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీతో చర్చించేందుకే సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈనెల 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ..
విద్యుత్ రంగంలో జగన్ అక్రమాలు..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jul 02 , 2024 | 09:12 AM