సీఎం చంద్రబాబు సంతకం..
ABN, Publish Date - Dec 13 , 2024 | 12:56 PM
అమరావతి: స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కదు.. ప్రగతికి, సంప్రదాయాలకు, ధృడసంకల్పానికి ప్రతీక అంటూ.. మన కోసం, మన ప్రగతి కోసం చేస్తున్న విజన్ ఇది.
అమరావతి: స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కదు.. ప్రగతికి, సంప్రదాయాలకు, ధృడసంకల్పానికి ప్రతీక అంటూ.. మన కోసం, మన ప్రగతి కోసం చేస్తున్న విజన్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.. చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా సంతకాలు చేశారు.
కాగా స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి విజయవాడ నగరం వేదిక అయింది. శుక్రవారం ఇందిరా గాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. పెద్దఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరయ్యారు. అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో స్వర్ణాంధ్ర @ 2047 పై ఏర్పాటు చేసిన స్టాల్లను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మంత్రులు సందర్శించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అజ్ఞాతంలో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యులు..
ప్రజా సమ్యస్యల మీద పోరాడే ఫార్ములే కేటీఆర్..
మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..
హైదరాబాద్ బేగంబజార్లో దారుణం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 13 , 2024 | 12:56 PM