బుడమేరు ఎఫెక్ట్.. నీట మునిగిన పరిశ్రమలు ..
ABN, Publish Date - Sep 07 , 2024 | 07:06 PM
విజయవాడ: బుడమేరు ముంపు బడుగుల జీవితాలనే కాదు.. చిన్న తరహా పరిశ్రమలను ముంచేసింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో విజయవాడ రూరల్ ప్రాంతాల్లో ఉన్న అనేక పరిశ్రమలు నీట మునిగాయి. కోట్ల రూపాయలు విలువ చేసే సరుకు, మిషనరీ మొత్తం పనికిరాకుండా పోయింది.
విజయవాడ: బుడమేరు ముంపు బడుగుల జీవితాలనే కాదు.. చిన్న తరహా పరిశ్రమలను ముంచేసింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో విజయవాడ రూరల్ ప్రాంతాల్లో ఉన్న అనేక పరిశ్రమలు నీట మునిగాయి. కోట్ల రూపాయలు విలువ చేసే సరుకు, మిషనరీ మొత్తం పనికిరాకుండా పోయింది. ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉన్న పరిశ్రమలన్నీ మూసివేయడం తప్ప మరో మార్గం లేదని నిర్వాహకులు అంటున్నారు.
బుడమేరు వరద అపారమైన నష్టాల్ని మిగిల్చింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదతో నిలవ ఉంచిన సామాగ్రి వరదకు కొట్టుకుపోయింది, ఇలాంటి వదర ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని పరిమశ్రల నిర్వాహకులు చెబుతున్నారు. నాలుగు అడుగుల నుంచి ఏడు అడుగుల నీరు అర గంటలో వచ్చిందని.. దీంతో సామగ్రి, యంత్రాలను సేవ్ చేసుకునే అవకాశం లేదని, వరద నీటికి బయటకు రాలేకపోయామని నిర్వాహకులు వాపోయారు. బుడమేరు ప్రక్షాళన లేకపోవడమే దీనంతటికి కారణమని అంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెగిన చెరువు కట్ట.. దీన పరిస్థితిలో గ్రామస్థులు
గేట్లను ఢీ కొట్టిన బోట్లు.. యజమానుల ఆచూకీ లభ్యం..
దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో కీలక ట్విస్టు..
విజయవాడ వాసులకు మరో చేదు వార్త..
గండ్ల పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేష్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 07 , 2024 | 07:06 PM