ఏపీ నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం తరలింపు..

ABN, Publish Date - Dec 10 , 2024 | 11:10 AM

అమరావతి: రేషన్ బియ్యం అక్రమ రవాణ అంతా వ్యవస్థీకృతంగా సాగింది. ఎండీవో ఆపరేటర్లు.. రేషన్ కార్డు దారుల నుంచి కిలో రూ. 12 నుంచి రూ. 15కు కొనుగోలు చేశారు. అదే బియ్యాన్ని రూ. 5, 6 లాభానికి మండల, జిల్లాస్థాయి కొనుగోలుదారులకు విక్రయించారు. ఆ తర్వాత ఎగుమతిదారులు రంగంలోకి దిగుతారు.

అమరావతి: రేషన్ బియ్యం అక్రమ రవాణ అంతా వ్యవస్థీకృతంగా సాగింది. ఎండీవో ఆపరేటర్లు.. రేషన్ కార్డు దారుల నుంచి కిలో రూ. 12 నుంచి రూ. 15కు కొనుగోలు చేశారు. అదే బియ్యాన్ని రూ. 5, 6 లాభానికి మండల, జిల్లాస్థాయి కొనుగోలుదారులకు విక్రయించారు. ఆ తర్వాత ఎగుమతిదారులు రంగంలోకి దిగుతారు. కిలో బియ్యం రూ. 26కు కొని మిల్లులో పాలిష్ చేసి రూ. 45 నుంచి 50కు ఆఫ్రికాకు తరలిస్తారు. ఇలా చేతులు మారుతూ వెళ్లిన ఉచిత బియ్యం ఆఫ్రికాకు చేరేసరికి రూ. 120 నుంచి 150 అవుతుంది.


మిల్లర్లు పాలిష్ పట్టి పంపిణి చేసే బియ్యానికి ఉప్పుడు బియ్యం అని, లేక నూకలు అని ఓ ముద్ర వేసి పోర్టు వరకు చేర్చేవారు. సరుకు సరైనదేనని, న్యాయబద్ద రవాణానే జరుగుతోందని కస్టమ్స్ హౌస్ ఏజెంట్లు నిర్దారించాలి. ఆ తర్వాత బియ్యం నౌకలోకి చేర్చాలి. కొందరు బడా ఎగుమతిదారులు వాటికి కూడా మేనేజ్ చేసి తమ దందాకు లంగర్లు ఎత్తేశారు. ఇక లబ్దిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసే ఆపరేటర్ మొదలుకొని పోర్టులో ఉండే సీహెచ్ఏల వరకు అందరినీ వాడుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ తల్లి రూపం మారిస్తే కఠిన చర్యలు

డ్రైవర్‌తో భార్గవ్‌ దొంగ అరెస్టు డ్రామా

ఫంగస్ అధరహో..

మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ ఏమన్నారంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 10 , 2024 | 11:10 AM