మోహన్బాబుపై మరో ఫిర్యాదు..
ABN, Publish Date - Dec 12 , 2024 | 02:07 PM
హైదరాబాద్: జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు దాడిపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. మోహన్ బాబుతో పాటు ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు దాడిపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. మోహన్ బాబుతో పాటు ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. మీడియాను మనోజ్ ఇంట్లోకి తీసుకువెళ్లినందుకే దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంచు విష్ణు నిర్మిస్తున్న ఓ సినిమా ప్రమోషన్ కోసం కుటుంబం ఆడుతున్న డ్రామా అని ఆయన ఫిర్యాదులో తెలిపారు.
మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి గురువారం మరోసారి ఫిర్యాదు అందింది. పహాడి షరిఫ్ పోలీసులకు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో నాలుగైదు అంశాలను ప్రస్తావించారు. జర్నలిస్టులు అక్కడ మీడియా కవరేజ్ చేస్తున్న క్రమంలో మనోజ్పై మోహన్ బాబు, ఆయన బౌన్సర్లు దాడి చేసిన క్రమంలో తన రక్షణ కోసం మనోజ్ మీడియాను లోపలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని.. ఆ క్రమంలోనే మీడియాపై విచక్షణా రహితంగా మోహన్ బాబు దాడి చేశారని అరుణ్ కుమార్ తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం
ఎందుకు రాజీనామా చేశానంటే..: అవంతి శ్రీనివాస్
ప్రేమ కోసం మతం మార్చుకున్నా.. అయినా..
ప్రపంచ రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 12 , 2024 | 02:07 PM