Ramanthapur Homeopathy Hospital: ఆసుపత్రిలో పెచ్చులూడి మీద పడడంతో విద్యార్థులకు గాయాలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:44 PM
రామంతాపూర్లోని ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రిలో సిలింగ్ పెచ్చులూడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థినులు గాయపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్, జూన్ 07: రామంతాపూర్లోని ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రిలో సిలింగ్ పెచ్చులూడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థినులు గాయపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా.. మరో విద్యార్థినికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో తీవ్రగాయాలైన విద్యార్థినికి ఐసీయూలో వైద్యులుె చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇన్పేష్ంట్ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.
For Latest News and National News click here