Share News

Road Accident: అతివేగంగా వచ్చిన కంటైనర్‌ ఢీకొని ఇద్దరి మృతి

ABN , Publish Date - Dec 23 , 2024 | 05:01 AM

కంటైనర్‌ అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

Road Accident: అతివేగంగా వచ్చిన కంటైనర్‌ ఢీకొని ఇద్దరి మృతి

పటాన్‌చెరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కంటైనర్‌ అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. మచిలీపట్నానికి చెందిన అశోక్‌కుమార్‌ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఉంటూ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన.. భార్య శ్యామల(27), అన్న కొడుకు గణేశ్‌(17)తో కలిసి సంగారెడ్డిలోని బంధువుల ఇంటికి స్కూటీపై బయలుదేరారు.


ఈ క్రమంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ భారీ కంటైనర్‌ ఇస్నాపూర్‌ సమీపంలో స్కూటీని ఢీకొట్టింది. ముగ్గురూ రోడ్డుపై పడిపోగా శ్యామల, గణేశ్‌ పైనుంచి కంటైనర్‌ చక్రాలు వెళ్లడంతో వారిద్దరూ మృతి చెందారు. స్కూటీ నడుపుతున్న అశోక్‌కుమార్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 23 , 2024 | 05:01 AM