Share News

Road Accident: అందోల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన పెళ్లి బృందం ట్రాక్టర్.. మృతులెందరంటే

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:39 PM

సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌పై వెళ్లిన ఓ బ‌ృందం కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మ‌ృతి చెందగా.. 20 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.

Road Accident: అందోల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన పెళ్లి బృందం ట్రాక్టర్.. మృతులెందరంటే

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌పై వెళ్లిన ఓ బ‌ృందం కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మ‌ృతి చెందగా.. 20 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.

జోగిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన పెళ్లి బృందం అందోల్ పట్టణంలో నుంచి పెళ్లి కూతురును తీసుకురావడానికి బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ మాన్సాన్‌పల్లి దగ్గరికి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో 20మందికిపైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులను బాచారం గ్రామస్థులుగా గుర్తించారు. క్షతగాత్రులను జోగిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇటీవలే అందోల్ మీదుగా వెళ్లే జాతీయ రహదారి 161పై కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మ‌ృతి చెందారు.

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్, హరీశ్‌ను ముద్దాయిలుగా చేర్చండి: రఘునందన్ రావు

Updated Date - Mar 27 , 2024 | 05:42 PM