TS News: ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది: భట్టి
ABN , Publish Date - Mar 29 , 2024 | 07:47 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందన్నారు.
హైదరాబాద్, మార్చి 29: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka) తెలిపారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందన్నారు. రేవంత్ రెడ్డి (Revantreddy) పాలనపై ప్రజల్లో ఉన్న స్పందనను లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోనే మనం మంచి ఫలితాలు అందించాలన్నారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్లో పీఈసీ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రైతు బంధు ఇవ్వలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
64 లక్షల 75 వేల మంది రైతులకు రూ.5,500 కోట్లు రైతు బంధుగా అందిచామని చెప్పారు. అంటే 92 శాతం మంది రైతులకు రైతు బంధు కింద సాయం చేశామంటూ.. ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, కీలక నేతలు సైతం హాజరయ్యారు.