TS Assembly: ఐదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు
ABN , Publish Date - Feb 13 , 2024 | 08:53 AM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదోరోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై సభలో చర్చ జరగనుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు.
![TS Assembly: ఐదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/assembly_6666b2a06f.jpg)
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదోరోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై సభలో చర్చ జరగనుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు. సభ ప్రారంభమైన 10 నిమిషాలకు అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు బయల్దేరేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ కోసం సభ్యులందరిని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లోనే మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు.