Share News

వివాదాస్పదంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అక్షింతల పంపిణీ కార్యక్రమం

ABN , Publish Date - Jan 06 , 2024 | 08:25 AM

నాచారం డిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నేడు అయోధ్య రాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇది వివాదాలకు కారణంగా మారుతోంది. పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటాన్ని పీడీఎస్‌యూ వ్యతిరేకిస్తోంది.

వివాదాస్పదంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అక్షింతల పంపిణీ కార్యక్రమం

హైదరాబాద్: నాచారం డిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నేడు అయోధ్య రాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇది వివాదాలకు కారణంగా మారుతోంది. పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటాన్ని పీడీఎస్‌యూ వ్యతిరేకిస్తోంది. మల్కా కొమురయ్య ఆధ్వర్యంలో అక్షింతలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి హాజరవుతోంది. మతపరమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కార్యక్రమాన్ని అడ్డుకుంటామంటామని పీడీఎస్‌యూ స్పష్టం చేస్తోంది. పీడీఎస్‌యూ వ్యవహార శైలిని హిందుత్వ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

Updated Date - Jan 06 , 2024 | 08:25 AM