Share News

CAG: తెలంగాణలో ఇసుక తవ్వకాలపై కాగ్ అక్షింతలు

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:39 PM

తెలంగాణలో ఇసుక తవ్వకాలపై కాగ్ అక్షింతలు వేసింది. పేరుకే గిరిజన సంఘాలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చారని.. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కాంట్రాక్టులు బదలాయించారని పేర్కొంది. ప్రభుత్వం ఇసుక అక్రమాలను అడ్డుకోలేక పోయిందని తెలిపింది.

CAG: తెలంగాణలో ఇసుక తవ్వకాలపై కాగ్ అక్షింతలు

హైదరాబాద్: తెలంగాణలో ఇసుక తవ్వకాలపై కాగ్ అక్షింతలు వేసింది. పేరుకే గిరిజన సంఘాలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చారని.. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కాంట్రాక్టులు బదలాయించారని పేర్కొంది. ప్రభుత్వం ఇసుక అక్రమాలను అడ్డుకోలేక పోయిందని తెలిపింది. ఇసుక తవ్వకాల ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవన్నారు. అధిక లోడ్‌లు వేసి ప్రజాధనానికి నష్టం చేశారని కాగ్ పేర్కొంది. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ లేదని వెల్లడించింది. అనుమతులు లేకుండా అధిక ఇసుక తవ్వకం, అక్రమ రవాణా జరిగిందన్నారు.

పర్యావరణ రక్షణ కోసం ఎలాంటి చర్యలు లేవని కాగ్ తెలిపింది. ఆసరా పెన్షన్ల అక్రమాలపై కాగ్ నివేదిక అందుకుంది. రెండు లక్షల అనర్హులకు ఆసరా పెన్షన్లు ఇచ్చారని కాగ్ వెల్లడించింది. దానివల్ల 1175 కోట్లు దుర్వినియోగం అయ్యాయని తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వేలో 19 శాతం కుటుంబాల సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే 16% మంది అనర్హులకు ఆసరా పింఛన్లు దక్కాయని తెలిపింది. ఆసరా సాఫ్ట్‌వేర్‌లో అనేక లోపాలు ఉన్నాయని.. నిర్ధిష్ట ఆదాయానికి మించిన ఆదాయం ఉన్న వాళ్లకి కూడా పెన్షన్లు ఇచ్చారని కాగ్ వెల్లడించింది.

Updated Date - Feb 15 , 2024 | 01:46 PM