Share News

Hyderabad: జైలులో నిందితుడికి కరోనా పాజిటివ్‌

ABN , Publish Date - Jan 13 , 2024 | 10:50 AM

చంచల్‌గూడ(Chanchalguda) జైలులో ఓ నిందితుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. లంగర్‌హౌస్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఓ కేసు విషయమై ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి శుక్రవారం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Hyderabad: జైలులో నిందితుడికి కరోనా పాజిటివ్‌

సైదాబాద్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): చంచల్‌గూడ(Chanchalguda) జైలులో ఓ నిందితుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. లంగర్‌హౌస్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ కేసు విషయమై ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి శుక్రవారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. వారికి నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించారు. వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరికి జైలు వైద్యులు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు లేవని తేలింది. ముందు జాగ్రత్తగా వారిని ప్రత్యేక బారక్‌లో ఉంచినట్లు సమాచారం.

Updated Date - Jan 13 , 2024 | 10:50 AM