Share News

Hyderabad: ఉస్మానియా పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం

ABN , Publish Date - Jan 27 , 2024 | 10:33 AM

ఉస్మానియా పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం రేగింది. హాస్టల్ బాత్రూంలో ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. విద్యార్థినికి కిటికీ నుంచి ఓ పోకిరి సైగలు చేశాడు. దీంతో పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్ ఎదుట స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో సైతం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు.

Hyderabad: ఉస్మానియా పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం

హైదరాబాద్: ఉస్మానియా పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం రేగింది. హాస్టల్ బాత్రూంలో ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. విద్యార్థినికి కిటికీ నుంచి ఓ పోకిరి సైగలు చేశాడు. దీంతో పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్ ఎదుట స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో సైతం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడకు చేరుకున్న పోలీసులతో విద్యార్థులకు వాగ్వాదం జరిగింది. ఓయూ రిజిస్ట్రార్ వచ్చి విద్యార్థులను ధర్నా విరమించాలని కోరారు. వీసీ వచ్చే వరకు ధర్నా విరమించబోమని స్టూడెంట్స్ భీష్మించారు.

విద్యార్థినుల కథనం ప్రకారం అసలేం జరిగిందంటే..

రాత్రి 2 గంటలకు ముగ్గురు ఆగంతకులు తాగి హాస్టల్లోకి వచ్చారు. హాస్టల్ వాష్‌రూమ్ వెంటిలేటర్స్ ద్వారా విద్యార్థినులను రమ్మంటూ సైగలు చేసి పిలుస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఇద్దరు పారిపోయారు. గత వారం రోజులుగా ఇలాగే జరుగుతోందని విద్యార్థినులు చెబుతున్నారు. కాలేజ్ చుట్టూ గంజాయి బ్యాచ్ పెరిగిపోయిందని తెలియజేస్తున్నారు. వీసీ వచ్చి తమకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. 250 మంది విద్యార్థినులు ఉండే హాస్టల్ కి కేవలం ఒకరే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు.

Updated Date - Jan 27 , 2024 | 10:33 AM