Share News

CM Revanth Reddy: ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:56 PM

ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని సీఎం రేవంత్ సూచించారు.

CM Revanth Reddy: ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

హైదరాబాద్: ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని సీఎం రేవంత్ సూచించారు. రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు ఆయన సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 17 స్థానాలకు 12 తగ్గకుండా గెలవాలని టార్గెట్ నిర్దేశించారు.

కాగా ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ జరగనుంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించిన ఆయన సీఎం అయిన తర్వాత కూడా తొలి సభను అక్కడే నిర్వహించబోతున్నారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనానికి శంఖుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచన చేశారు.

కాగా ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని సమావేశంతో నేతలతో సీఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇంచార్జి మంత్రులకు అప్పగించారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని భరోసా ఇచ్చారు. తాను గత సీఎంల మాదిరికాదని తేల్చి చెప్పారు. జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటాని చెప్పారు.

Updated Date - Jan 08 , 2024 | 10:56 PM