CM Revanth Reddy: నాలో ఇద్దరు ఉన్నారు.. ఒకరు చంద్రబాబు.. మరొకరు..
ABN , Publish Date - Jan 06 , 2024 | 08:49 PM
జీవితంలో నిరాశ చెందకుండా ముందుకెళ్లాలనే కల సాకారమైందని, నెల రోజుల పాలన బాగానే సాగిందని అనుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పక్షపాతం లేకుండా పాలన చేయాలనుకుంటున్నానని, తమ దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలని అనుకుంటున్నానని సీఎం తెలిపారు.
![CM Revanth Reddy: నాలో ఇద్దరు ఉన్నారు.. ఒకరు చంద్రబాబు.. మరొకరు..](https://media.andhrajyothy.com/media/2023/20231205/CM_REVATH_3c640498c0.jpg)
హైదరాబాద్: జీవితంలో నిరాశ చెందకుండా ముందుకెళ్లాలనే కల సాకారమైందని, నెల రోజుల పాలన బాగానే సాగిందని అనుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పక్షపాతం లేకుండా పాలన చేయాలనుకుంటున్నానని, తమ దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలని అనుకుంటున్నానని సీఎం తెలిపారు. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో తెలంగాణ శకటం ఉంటుందని, ప్రధాని మోదీతో మాట్లాడి శకటం ప్రదర్శించేలా చేయగలిగానని పేర్కొన్నారు. ప్రధానిని కలిశాక అదనంగా ఐపీఎస్లను కేటాయించాలని కోరానని, అందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.