Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Oct 04 , 2024 | 07:29 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-10-04T12:19:07+05:30
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ
జీవో నెంబర్ 99పై స్టే విధించాలని కోరిన కేఏ పాల్
హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపివేయాలని వాదనలు వినిపించిన కేఏ పాల్
హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే కూల్చివేతలు చేపట్టాలని పార్టీ ఇన్ పర్సన్గా కేఏ పాల్ వాదనలు
అక్రమ కట్టడాలు కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కోరిన పిటిషనర్
ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమన్న న్యాయస్థానం
ప్రతి వాదులుగా హైడ్రా, ప్రభుత్వానికి నోటీసులు
కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా
-
2024-10-04T11:28:42+05:30
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
సిట్లో ఉన్న అధికారులపై పూర్తి విశ్వాసం ఉంది.
స్వతంత్ర విచారణ కోరుకుంటున్నందున కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి పర్యవేక్షణ చేయాలని అనుకుంటున్నాం: సొలిసిటర్ జనరల్
ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు.
కమిటీలో ఇద్దరు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర పోలీసు నుంచి, ఒకరి ఆహార భద్రత అథారిటీ నుంచి నియమిస్తూ ఆదేశాలు.
సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో కమిటీ పని చేస్తుంది: సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు విముఖత చూపిన ధర్మాసనం
వైవి సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం
రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచు కోలేదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించిన ధర్మాసనం.
భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని ధర్మాసనం సూచన
-
2024-10-04T11:24:55+05:30
తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ పోలీసు అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి: సొలిసిటర్ జనరల్
భక్తుల మనోభావాలకు చెందిన విషయం అయినందున దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నాం: సొలిసిటర్ జనరల్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై తమకు ఎలాంటి అనుమానాలు లేవు: కేంద్రం ప్రభుత్వం
-
2024-10-04T10:47:25+05:30
కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్: 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదనే వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం రేవంత్ బండారం మరోసారి బట్టబయలైంది.
వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని సీఎం రేవంత్ రెడ్డి విర్రవీగారు
సీఎం రేవంత్ మాటలు డొల్లమాటలేనని మరోసారి తేలిపోయింది.
డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం.
2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందనే మాటలు నయవంచన కాక మరేంటి
అధికారిక లెక్కల ప్రకారం.. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగింది.. అనధికారికంగా రుణమాఫీ కానీ రైతులెందరు
రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు.. రైతుబంధు సీజన్ ముగిసినా ఇవ్వలేదు
రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం.. రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపం
-
2024-10-04T09:23:50+05:30
పోస్టర్ల కలకలం
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్ల కలకలం.
కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు వెలిసిన పోస్టర్లు.
గ్రూప్-1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు..సిగ్గు అని పోస్టర్లు.
హైదర్ గూడలో తెలుగు అకాడమీ ముందు వెలసిన పోస్టర్లు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ పోస్టర్లు.
తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం
అకాడమీ పుస్తకాలు ఎవరు కొనొద్దని విజ్ఞప్తి చేస్తూ పోస్టర్లు.
-
2024-10-04T08:45:29+05:30
నవరాత్రి శోభ
వరంగల్: భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు
అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు
-
2024-10-04T08:05:05+05:30
సుప్రీంకోర్టు విచారణ
ఢిల్లీ: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ
విచారణ చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ
సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అనే అంశంపై వైఖరి తెలియజేయనున్న కేంద్రం
నిన్నటి విచారణ సందర్భంగా ఈ రోజు సమయం కోరిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
-
2024-10-04T07:54:03+05:30
కేటీఆర్, హరీశ్పై సైబర్ క్రైమ్లో కేసు
హైదరాబాద్: కేటీఆర్ హరీష్ రావుపై సైబర్ క్రైమ్లో కేసు
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు
సోషల్ మీడియాలో కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై ట్రోలింగ్
ట్రోల్ చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
కేటీఆర్, హరీష్ రావుతోపాటు పలు యూట్యూబ్ చానళ్లపై కేసు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
2024-10-04T07:50:49+05:30
మరోసారి నోటీసులు
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు మరోసారి ఈడీ నోటీసులు
ఈ నెల 8వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ
నిన్న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్న అజారుద్దీన్
వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేనని అజార్ విన్నపం
8వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం
-
2024-10-04T07:29:42+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.