Breaking News: ఆ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
ABN , First Publish Date - Nov 29 , 2024 | 10:06 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-11-29T22:04:47+05:30
సినీ ఫక్కిలో చోరీ
సత్తెనపల్లిలోని సంగం బజార్ లో సినీ ఫక్కిలో చోరీ
ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధుడి దృష్టి మరల్చి మెడలోని బంగారు గొలుసు అపహరించిన దుండగుడు
ఇంట్లోకి వచ్చి అగ్గిపెట్టె అడిగిన దుండగుడు
అగ్గిపెట్టె ఇస్తుండగా చైన్ లాక్కెళ్లిన దుండగుడు ..
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు గోపాలరావు
-
2024-11-29T21:10:06+05:30
టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్గా బాధ్యతల స్వీకరణ
టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నవ మోహన్ కృష్ణ
గుంటూరులో ప్రమాణస్వీకార సభ
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు , చదలవాడ అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మ రెడ్డి, నరేంద్ర వర్మ, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఛైర్మన్ పట్టాబి, పలువురు టిడిపి నేతలు
మన్నవ మోహన్ కృష్ణ ను అభినందించిన నేతలు
తనకు ఇచ్చిన పదవిని హోదాలా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తానన్న మన్నవ మోహన్ కృష్ణ
-
2024-11-29T21:06:25+05:30
మహిళపై యాసిడ్ దాడి
విశాఖపట్టణంలో ఆర్టీసీ బస్సులో మహిళలపై యాసిడ్ దాడి
యాసిడ్ దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి
యాసిడ్ దాడి అనంతరం అక్కడ నుంచి నిందితుడు పరార్
కళ్ళు మంటలతో విలపిస్తున్న ముగ్గురు మహిళలు
ఆటోలో ఆస్పత్రికి తరలింపు
కంచరపాలెం ఐటిఐ జంక్షన్ వద్ద ఘటన
ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో స్తంభించిన ట్రాఫిక్
ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న కంచరపాలెం పోలీసులు
-
2024-11-29T20:17:22+05:30
విజయనగరంలో ఎన్వీ రమణ పర్యటన
శనివారం విజయనగరంలో పర్యటించనున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్.వి. రమణ
ఆనందగజపతి కళాక్షేత్రంలో నటుడు, రచయిత మీగడ రామలింగస్వామికి గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ
-
2024-11-29T20:12:36+05:30
ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదం
ఆత్మకూరు మండలం కరివేన గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
మృతి చెందిన వ్యక్తి నందికుంట గ్రామానికి చెందిన శంకర్గా గుర్తింపు
-
2024-11-29T20:08:07+05:30
ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
జిల్లా కోర్టు లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన డాక్టర్ ప్రభావతి
రఘురామకృష్ణంరాజు కస్టోడీయల్ టార్చర్ కేసులో ఐదవ నిందితరాలుగా ప్రభావతి
అప్పట్లో జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ ప్రభావతి
రఘురామ మెడికల్ రిపోర్ట్ తప్పుగా ఇచ్చినట్లు అభియోగం
విజయ్ పాల్ అరెస్ట్ నేపథ్యం లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ప్రభావతి
-
2024-11-29T20:05:40+05:30
టీటీడీ ఛైర్మన్ను కలిసిన బీజేపీ నాయకులు
టీటీడీ ఛైర్మన్ను బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు
టీటీడీ ఛైర్మన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాజానగరం నియోజకవర్గం కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి
రాజమండ్రిలో బీఆర్ నాయుడును కలిసిన వీరన్న చౌదరి
టీటీడీలో చేపట్టిన సంస్కరణలపై అభినందనలు తెలిపిన వీరన్న చౌదరి

-
2024-11-29T19:13:59+05:30
డోన్లో భారీ మోసం
నంద్యాల జిల్లా డోన్లో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం
రూ.40 కోట్లు వసూలు చేసిన రామాంజనేయులు
కేవ ఇండస్ట్రీస్ పేరుతో మోసానికి పాల్పడ్డ నిందితుడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన 200 మంది బాధితులు
-
2024-11-29T17:30:02+05:30
కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో రామ్మోహన్ నాయుడు భేటీ
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశం
విశాఖ ఎంపీ భరత్ , కర్నూలు ఎంపీ నాగరాజు, అమలాపురం ఎంపీ హరీష్ , చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు భేటీ
ఏపీ లో పర్యాటక ప్రాజెక్టులపై చర్చ
-
2024-11-29T17:26:24+05:30
ర్యాలీలో కవిత
బసవతారకం ఆసుపత్రి వద్దకు చేరుకున్న కవిత
పార్టీ నేలతో కలసి ర్యాలీగా తెలంగాణ భవన్కు ఎమ్మెల్సీ కవిత
-
2024-11-29T17:24:39+05:30
ఆ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.
మూల వేతనంపై 5శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
-
2024-11-29T16:58:51+05:30
సరగోసి మహిళ ఆత్మహత్యను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సి
తెలంగాణలో సరోగసి మహిళ ఆత్మహత్యను సుమోటో కేసుగా విచారణకు స్వీకరించిన జాతీయ మానవహక్కుల సంఘం
మై హోమ్ బూజా 9వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న బీహార్కు చెందిన మహిళ
తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు జారీచేసిన జాతీయ మానవ హక్కుల సంఘం
ఘటనపై తక్షణమే నివేదిక పంపాలని ఆదేశాలు
సరోగసి కోసం వచ్చిన మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన రాయదుర్గానికి చెందిన ఓ వ్యక్తి
సరోగసి కోసం ఉండలేక నవంబర్ 27న ఆత్మహత్య చేసుకున్న ఒడిశాకు చెందిన మహిళ
పది లక్షల రూపాయలు చెల్లించి సరోగసి కోసం ఒడిశా నుంచి మహిళను తెచ్చుకున్న రాయదుర్గానికి చెందిన వ్యక్తి
-
2024-11-29T16:54:38+05:30
శ్రీశైలం ఆలయానికి నూతన ఈవో
శ్రీశైలం దేవస్థానం నూతన ఈవోగా ఎమ్.శ్రీనివాసరావు నియామకం
రాష్ట్ర మెడికల్ బోర్డ్ నుండి దేవాదాయశాఖకు బదిలీ
శ్రీశైలం ఈవోగా శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
-
2024-11-29T16:35:07+05:30
రిషితేశ్వరి కేసులో నిందితులకు ఊరట
నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు ఊరట
9 ఏళ్ల సుదీర్థ విచారణ తర్వాత కేసు కొట్టేసిన కోర్టు
2015లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసు
-
2024-11-29T16:05:12+05:30
గుంటూరు కోర్టుకు బోరుగడ్డ అనిల్
గుంటూరు జిల్లా కోర్టుకు బోరుగడ్డ అనిల్ ను తీసుకొచ్చిన పట్టాభిపురం పోలీసులు
సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషణలపై కేసు నమోదు
పిటీ వారెంట్ పై బోరుగడ్డను రాజమండ్రి జైలు నుంచి తీసుకొచ్చిన పోలీసులు
బోరుగడ్డ అనిల్కు 14 రోజుల రిమాండ్ విధించిన జిల్లా కోర్టు
రాజమండ్రి జైలుకు బోరుగడ్డ తరలింపు
-
2024-11-29T15:30:53+05:30
గవర్నర్తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ఇవాళ సాయంత్రం 8 గంటలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్న సీఎం చంద్రబాబు
పలు కీలక అంశాలపై చర్చించనున్న చంద్రబాబు
రాష్ట్రం లో పర్యటిస్తున్న మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
కోవింద్కు మర్యాదపూర్వకంగా నేడు విందు ఇవ్వనున్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్
ఈ సందర్భంగా రాజ్ భవన్ కి వెళ్లి కోవింద్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వక భేటీ కానున్న సీఎం చంద్రబాబు
-
2024-11-29T15:26:19+05:30
బీఆర్ఎస్ దీక్షా దివస్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్లో బీఆర్ఎస్ దీక్షా దివస్
దీక్షా దివస్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్ పై ప్రజలు తిరగబడుతున్నారు
ఏడాది పాలనలోనే ప్రజలు తిట్ల పురాణం అందుకున్నారు
రేవంత్ రెడ్డికి మూడింది
తెలంగాణ లో చిల్లర ప్రభుత్వం నడుస్తోంది
దీక్షా దివస్ రోజు మీడియా డైవర్షన్ కోసమే మంత్రులు పర్యటనలు పెట్టుకున్నారు
తెలంగాణ ప్రజల కోసం నాడు కేసీఆర్ దీక్ష
కేసీఆర్ దీక్షా దివస్ తోనే నాడు కేంద్రంలో కదలిక
నాడు తెలంగాణ కాంగ్రెస్ చేతిలో బందీ అయింది
నేడు రేవంత్ చేతిలో బందీ అయ్యింది
11 నెలల్లో తెలంగాణను అస్తవ్యస్తం చేశారు
2027 లో జమిలీ ఎన్నికలు
మళ్లీ అధికారం బీఆర్ఎస్ దే
గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు సవరించుకుంటాం
పోలీసు కేసులకు భయపడం
-
2024-11-29T13:40:53+05:30
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
లగచర్ల భూసేకరణపై వెనక్కి తగ్గిన సర్కార్
భూ సేకరణ ప్రకటన నిలిపి వేస్తూ ఉత్తర్వులు
-
2024-11-29T13:19:07+05:30
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు తీర్పును గత జగన్ ప్రభుత్వ హయాంలో సుప్రీంలో సవాలు చేసిన సీబీసీఐడీ
ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వర్చువల్గా వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి
బెయిల్ రద్దును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న ముకుల్ రోహత్గి
ఢిల్లీలో లేనని, విచారణకు స్వయంగా హాజరు కావాలని అకుంటున్నందు వల్ల జనవరి వరకు సమయం ఇవ్వాలని కోరిన ముకుల్ రోహత్గి
జనవరి రెండో వారానికి కేసు విచారణను వాయిదా వేసిన జస్టిస్ బేలా ఎం త్రివేదీ ధర్మాసనం
-
2024-11-29T12:40:48+05:30
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం
ట్రింకోమలీకి 270 కి.మీ, నాగపట్నానికి 300 కి.మీ, పుదుచ్చేరికి 340 కి.మీ, చెన్నైకి 380 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
రాగల 6 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం
రేపు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం సమీపంలో గల..
కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం
ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు,
మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
-
2024-11-29T12:36:01+05:30
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు పిటిషన్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని పిటిషన్.
తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని పేర్కొన్న ప్రభాకర్ రావు.
ప్రభుత్వం తనను వేధిస్తుందని పిటిషన్లో పేర్కొన్న ప్రభాకర్ రావు.
తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్న ప్రభాకర్ రావు.
ఫ్లోరిడాలో తన కుమారుని వద్ద ఉంటున్నానని పేర్కొన్న ప్రభాకర్ రావు.
అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియా రప్పించేందుకు ప్రయత్నం.
ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసుల ప్రయత్నాలు.
చికాగోకు చేరుకున్న చానల్ ఎండీ శ్రవణ్ రావు
చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్ కనుగొన్న పోలీసులు
-
2024-11-29T12:34:10+05:30
సుప్రీంకోర్టుకు చేరిన భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు ఇష్యూ
సుప్రీంకోర్టుకు చేరిన వై ఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం
వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు
భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ
మరికొద్ది సేపట్లో సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
-
2024-11-29T12:30:56+05:30
భారీ చోరీ
కూకట్ పల్లి జయనగర్లో భారీ చోరీ
నిన్న రాత్రి ఓ ఇంట్లో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు
బీరువా పగులగొట్టి 80 తులాల బంగారం
2 లక్షల నగదు చోరీ చేసిన దుండగులు
-
2024-11-29T11:33:15+05:30
సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ
స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన జగన్ ప్రభుత్వం
-
2024-11-29T11:30:58+05:30
వాయు కాలుష్యం..
ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం స్థాయి
కొన్ని ప్రాంతాల్లో 400 పాయింట్లు దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
ఢిల్లీలో సగటున 332 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు
-
2024-11-29T11:02:21+05:30
పట్నం నరేందర్రెడ్డికి హైకోర్టులో ఊరట
నరేందర్పై నమోదైన 3 ఎఫ్ఐఆర్లలో రెండు కొట్టేసిన హైకోర్టు
ఒకే ఘటనలో 3 ఎఫ్ఐఆర్ నమోదును సవాల్ చేసిన నరేందర్రెడ్డి
నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు: నరేందర్రెడ్డి
నరేందర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు
-
2024-11-29T10:36:56+05:30
ఆప్ ఎంపీల నిరసన
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల ఆందోళన
ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని నినాదాలు
కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్
-
2024-11-29T10:34:15+05:30
అవినాష్ అనుచరులకు రాచ మర్యాదలు
కడప: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీధర్ రెడ్డికి తిరుమలలో మర్యాదలు
రాచమర్యాదలు చేసిన టీడీపీ నేత లు
సీఎం చంద్రబాబు దృష్టికి తీసువెళ్ళిన రాచమర్యాదల వ్యవహారం
కడప టీడీపీ నేతలు ఎవరనే అంశంపై ఆరా తీస్తోన్న సీఎం చంద్రబాబు
-
2024-11-29T10:30:21+05:30
రిషితేశ్వరి కేసులో తీర్పు
గుంటూరు జిల్లా: రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఈ రోజు కోర్టు తీర్పు
2015 జులై 14వ తేదీన రిషితేశ్వరి ఆత్మహత్య
నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన రిషితేశ్వరి
రిషితేశ్వరి స్వస్థలం వరంగల్
ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నానని రిషితేశ్వరి సూసైడ్ నోట్
అప్పట్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య
నేడు తీర్పు వెలువరించనున్న గుంటూరు జిల్లా ఐదవ కోర్టు
-
2024-11-29T10:26:28+05:30
ఆంజనేయస్వామి విగ్రహం తొలగింపు
సూర్యాపేట: చిలుకూరు మండలం రామాపురంలో ఉద్రిక్తత.
అర్ధరాత్రి కరెంటు ఆఫ్ చేసి ఆంజనేయస్వామి విగ్రహం తొలగింపు
వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వదిలి పెట్టిన వైనం
గ్రామంలో భయాందోళనలు, పోలీసు బలగాల మోహరింపు
-
2024-11-29T10:09:38+05:30
మహిళపై పులిదాడి
కొమురం భీం జిల్లాలో మహిళ పై పులి దాడి
కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్లో ఘటన
వ్యవసాయ పనులకు వెళ్తుండగా దాడి చేసిన పులి
మహిళకు తీవ్ర గాయాలు, ఆసుపత్రి కితరలింపు
పులి దాడిలో మహిళ మృతి
మృతురాలు గన్నారం వాసి మోర్లే లక్ష్మీ
-
2024-11-29T10:04:29+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.