Share News

TS News: ఎనిమిదో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి

ABN , Publish Date - Feb 08 , 2024 | 12:29 PM

ఇప్పుడు గుండెపోటు మరణాలు సర్వసాధారణంగా మారాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు ఇటీవలి కాలంలో సంభవిస్తున్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో విషాదం చోటు చేసుకుంది.

TS News: ఎనిమిదో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి

సిద్దిపేట: ఇప్పుడు గుండెపోటు మరణాలు సర్వసాధారణంగా మారాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు ఇటీవలి కాలంలో సంభవిస్తున్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధిని లాక్షణ్య(13) మృతి చెందింది. మంగళవారం జ్వరం రావడంతో లావణ్య టాబ్లెట్ వేసుకుంది. మరుసటి రోజు బాత్ రూమ్‌కు వెళ్లి అక్కడే లావణ్య కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా తీవ్రమైన గుండెపోటుతో చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు.

Updated Date - Feb 08 , 2024 | 01:41 PM