Share News

IPL Tickets: బ్లాక్‌లో ఐపీఎల్‌ టిక్కెట్ల విక్రయం.. 8 మంది అరెస్ట్‌

ABN , Publish Date - Apr 11 , 2024 | 10:46 AM

ఐపీఎల్‌ టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 8వ తేది స్థానిక చెపాక్‌ క్రికెట్‌ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ - కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌(Chennai Super Kings - Kolkata Knight Riders) మధ్య మ్యాచ్‌ జరిగింది.

IPL Tickets: బ్లాక్‌లో ఐపీఎల్‌ టిక్కెట్ల విక్రయం.. 8 మంది అరెస్ట్‌

చెన్నై: ఐపీఎల్‌ టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 8వ తేది స్థానిక చెపాక్‌ క్రికెట్‌ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ - కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌(Chennai Super Kings - Kolkata Knight Riders) మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయాలు ఆన్‌లైన్‌లో ప్రారంభమైన 10 నిమిషాల్లోనే విక్రయమయ్యాయి. దీంతో మ్యాచ్‌ చూడాలని ఆసక్తితో అక్కడకు చేరుకున్న అభిమానులకు కొందరు అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు ట్రిప్లికేన్‌ పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో పోలీసులు స్టేడియం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్న కౌశిక్‌, రాజేష్‌కుమార్‌, ఉదయకిరణ్‌, అళగప్పన్‌, రాజపాండి, జయవేలు, ఇమ్మానుయేల్‌, సచిన్‌ను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.13,500 విలువైన 13 టిక్కెట్లు, రూ.2,950 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇదికూడా చదవండి: BJP: రాసిపెట్టుకోండి... తమిళనాట బీజేపీ హవా ఖాయం..

Updated Date - Apr 11 , 2024 | 10:57 AM