Share News

Viral: ఈ మాత్రం దానికి స్టేడియంకు వెళ్లడం ఎందుకు? ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన యువతి ఏం చేసిందంటే..

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:58 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి నెలకొంది. సాయంత్రం అయితే చాలు క్రికెట్ అభిమానులు టీవీల ముందు వాలిపోతున్నారు. నగరాల్లో నివసించే వారు నేరుగా స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తున్నారు.

Viral: ఈ మాత్రం దానికి స్టేడియంకు వెళ్లడం ఎందుకు? ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన యువతి ఏం చేసిందంటే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (IPL 2024) సందడి నెలకొంది. సాయంత్రం అయితే చాలు క్రికెట్ అభిమానులు టీవీల ముందు వాలిపోతున్నారు. నగరాల్లో నివసించే వారు నేరుగా స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తున్నారు. తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసి పులకించిపోతున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవతున్న ఓ ఫొటో (Viral Photo) చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. వైరల్ అవుతున్న ఆ ఫొటోలో యువతి మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వెళ్లింది. అయితే మ్యాచ్ కాకుండా మొబైల్‌లో ``ఫ్రెండ్స్`` సిరీస్ (Friends series) చూస్తూ కూర్చుంది (Viral News).


ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (RCB vs LSG) టీమ్‌ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వెళ్లిన యువతి మొబైల్‌లో ``ఫ్రెండ్స్`` వెబ్ సిరీస్ చూసింది. Deepak Kumaar అనే ట్విటర్ యూజర్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2.7 లక్షల మందికి పైగా ఈ ట్వీట్‌ను వీక్షించారు.


ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మ్యాచ్ చాలా బోరింగ్‌గా అనిపించి ఉంటుంది``, ``మ్యాచ్ కంటే ఆ వెబ్ సిరీస్ ఆసక్తికరంగా అనిపించిందేమో``, ``చాలా మంది వీడియోలో కనిపించేందుకే ఐపీఎల్ మ్యాచ్‌లకు వెళ్తుంటారు``, ``ఈ మాత్రం దానికి స్టేడియంకు వెళ్లడం ఎందుకు?``, ``ఇలా వేరే వాళ్ల ప్రైవసీకి భంగం కలిగించడం నేరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: మీ కళ్లు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలో కత్తెరను కనిపెట్టండి..!

Viral: అమ్మో.. ఈ ఆటో ఎక్కితే కష్టమే.. జేబులో డబ్బులు లేకపోతే.. ఓ మహిళ చేసిన పోస్ట్‌పై నెటిజన్ల ఆగ్రహం.!

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం

Updated Date - Apr 05 , 2024 | 12:09 PM