Shocking: మ్యాచ్ ఆడుతున్న ఆటగాడిపై పడిన పిడుగు.. ఫుట్బాల్ మైదానంలో తీవ్ర విషాదం.. వీడియో వైరల్!
ABN , Publish Date - Feb 12 , 2024 | 08:52 PM
ఇండోనేసియాలోని జావాలో అందరూ చూస్తుండగా ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్న ఆటగాడిపై నేరుగా పిడుగు పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేశాడు.
![Shocking: మ్యాచ్ ఆడుతున్న ఆటగాడిపై పడిన పిడుగు.. ఫుట్బాల్ మైదానంలో తీవ్ర విషాదం.. వీడియో వైరల్!](https://media.andhrajyothy.com/media/2023/20231205/football_a74d4b0263.jpg)
ఇండోనేసియాలోని (Indonesia) జావాలో అందరూ చూస్తుండగా ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఫుట్బాల్ మ్యాచ్ (Football Match)ఆడుతున్న ఆటగాడిపై నేరుగా పిడుగు (Lightning) పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేశాడు. కళ్ల ముందు జరిగిన ఘటన చూసి ఎంతో మంది నివ్వెరపోయారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా (Viral Video) మారింది.
పశ్చిమ జావాలో (Java)రెండు స్థానిక జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోంది. అప్పటికే చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఆ మ్యాచ్ ఆడుతున్న ఓ 35 ఏళ్ల ఫుట్బాలర్పై పిడుగు పడింది. అప్పటి వరకు పరిగెడుతూ మ్యాచ్ ఆడుతున్న ఆ క్రీడాకారుడిపై పిడుగు పడడంతో కింద పడిపోయాడు. ఇతర ఆటగాళ్లు వెంటనే అతడి వైపు పరిగెత్తారు. అప్పటివరకు తమతో ఆడిన ఆటగాడు చలనం లేకుండా పడి ఉండడం చూసిన ప్లేయర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ షాకింగ్ వీడియో చూసిన వారు నివ్వెరపోతున్నారు. కాగా, ఏడాది కాలంలో ఇండోనేసియాలో ఓ క్రీడాకారుడు ఇలా పిడుగుపాటుకు గురి కావడం ఇది రెండో సారి. గతంలో ఓ క్రీడాకారుడు కూడా ఇలా మ్యాచ్ ఆడుతుండగా పిడుగు పడడంతో గుండెపోటుకు గురయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.