Share News

Viral: ముప్పై ఏళ్ల క్రితం రూ.500తో ఎస్బీఐ షేర్లు కొన్న తాత.. ప్రస్తుతం వాటి విలువ తెలుసుకుని షాక్ అయిన మనవడు!

ABN , Publish Date - Apr 02 , 2024 | 04:12 PM

ఆ వ్యక్తి చండీగఢ్‌కు చెందిన డాక్టర్.. ఇటీవల తన ఇంట్లో పాత డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు తిరగేస్తుండగా అతడి కంట ఓ డాక్యుమెంట్ పడింది.. పరిశీలించి చూస్తే అది ఎస్బీఐ షేర్లకు సంబంధించిన సర్టిఫికెట్..

Viral: ముప్పై ఏళ్ల క్రితం రూ.500తో ఎస్బీఐ షేర్లు కొన్న తాత.. ప్రస్తుతం వాటి విలువ తెలుసుకుని షాక్ అయిన మనవడు!

ఆ వ్యక్తి చండీగఢ్‌కు (Chandigarh) చెందిన డాక్టర్.. ఇటీవల తన ఇంట్లో పాత డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు తిరగేస్తుండగా అతడి కంట ఓ డాక్యుమెంట్ పడింది.. పరిశీలించి చూస్తే అది ఎస్బీఐ షేర్లకు (SBI Shares) సంబంధించిన సర్టిఫికెట్.. 1994లో తన తాత రూ.500 విలువైన ఎస్బీఐ షేర్లు కొన్నట్టు తెలుసుకున్నాడు.. ప్రస్తుతం దాని విలువ తెలుసుకుని షాకయ్యాడు. వెంటనే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకున్నాడు (Viral News).

``1994లో మా తాత రూ.500 విలువైన ఎస్బీఐ షేర్లు కొనుగోలు చేశారు. ఆయన వాటిని తిరిగి అమ్మలేదు. బహుశా మర్చిపోయి ఉంటారు. 30 ఏళ్ల క్రితం చేసిన ఆ చిన్న పెట్టుబడి ఇప్పుడు భారీగా మారిందనే చెప్పాలి. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం ఆ షేర్ల విలువ రూ.3.75 లక్షలు. అంటే 30 ఏళ్లలో పెట్టిన పెట్టుబడి 750 రెట్లు పెరిగిపోయింది. ఇది చాలా షాకింగ్‌గా అనిపించింది`` అంటూ చండీగఢ్‌కు చెందిన తన్మయ్ మోతీవాలా అనే డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

``రూ.3.75 లక్షలు అంటే తక్కువే అనుకోవచ్చు. కానీ, పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తం. ఇప్పుడు ఈ షేర్లు అమ్మడానికి ప్రయత్నిస్తున్నాం. పలువురు కన్సల్టెంట్లను కలిశాం. ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. ఎలాగైనా దీనిని పూర్తి చేస్తాం`` అంటూ తన్మయ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఏం ఐడియా గురూ.. రూపాయి ఖర్చు లేకుండా ఈ వేసవిలో చన్నీళ్ల స్నానం ఎలా చేయొచ్చో చూడండి..

Viral Video: కొబ్బరికాయను తల మీద కొట్టుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

Updated Date - Apr 02 , 2024 | 04:12 PM