Share News

Chennai: ఎన్నికల బరిలో ‘ఎలక్షన్‌ కింగ్‌’.. 239వసారి నామినేషన్‌ వేసిన పద్మరాజన్‌

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:50 PM

‘ఎలక్షన్‌ కింగ్‌’గా పేరుగాంచిన సేలం జిల్లా మేట్టూరుకు చెందిన పద్మరాజన్‌(Padmarajan) మళ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పటి వరకూ రాష్ట్రపతి సహా వివిధ ఎన్నికల కోసం 238 సార్లు నామినేషన్లు వేసిన పద్మరాజన్‌..

Chennai: ఎన్నికల బరిలో ‘ఎలక్షన్‌ కింగ్‌’.. 239వసారి నామినేషన్‌ వేసిన పద్మరాజన్‌

చెన్నై: ‘ఎలక్షన్‌ కింగ్‌’గా పేరుగాంచిన సేలం జిల్లా మేట్టూరుకు చెందిన పద్మరాజన్‌(Padmarajan) మళ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పటి వరకూ రాష్ట్రపతి సహా వివిధ ఎన్నికల కోసం 238 సార్లు నామినేషన్లు వేసిన పద్మరాజన్‌.. తాజాగా బుధవారం ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు 239వ సారి నామినేషన్‌ వేశారు. ఇప్పటి వరకూ ఆయన అన్ని ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయినా, ఆయ న నామినేషన్ల దాఖలు దాహం మా త్రం తీరడం లేదు.కాగా ప్రజల్లో ఓటుహక్కుపై అవగాహన కలిగించేందుకే తాను ఇలా నామినేషన్లు దాఖలు చేస్తున్నానే తప్ప,తనకెలాంటి పదవీ వ్యామోహం లేదని పద్మరాజన్‌ ఈ సందర్భంగా మీడియా వద్ద పేర్కొన్నారు.

nani6.jpg

Updated Date - Mar 22 , 2024 | 12:50 PM