Share News

Ayodhya Photos: బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు.. అబ్బురపరుస్తున్న ఫొటోలు

ABN , Publish Date - Apr 17 , 2024 | 04:10 PM

అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరిగాయి.

Ayodhya Photos: బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు.. అబ్బురపరుస్తున్న ఫొటోలు

అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరిగాయి.

lord ram1.jpgశ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించాయి. గుడి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు


lord ram5.jpgఈ ఏడాది జనవరి 22న ప్రధాని మోదీ(PM Modi) చేతులమీదుగా రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. మంగళవారమే సూర్య కిరణాల ప్రసరణ ప్రక్రియను శాస్త్రవేత్తలు పరిశీలించారు.


lord ram2.jpgప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహం నుదుట కిరణాలతో తిలకం(Surya Tilak) ఏర్పాటు చేయడమే సూర్య తిలక్ ముఖ్య ఉద్దేశం.


lord ram3.jpg

చైత్రమాసంలో సాక్షాత్కరించే ఈ అద్భుత దృశ్యం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ఆవిష్కృతమైంది. మూడున్నర నిమిషాలపాటు సూర్య తిలకం 58 మి.మీ.ల పరిమాణంలో కనిపించి భక్తులకు కనువిందు చేసింది.

lord ram0.jpg

రెండు నిమిషాలు పూర్తిస్థాయిలో తిలకంలా కనిపించింది. అంటే బాల రాముడి నుదుటిని సూర్యుడు ముద్దాడాడన్నమాట.

Ayodhya.jpg

సూర్య అభిషేకం, సూర్య తిలకంగా పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు అయోధ్య రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. తన్మయత్వంతో పులకించిన భక్త జనం

Updated Date - Apr 17 , 2024 | 04:22 PM