Share News

kiwi Face pack : మెరిసే చర్మానికి కివీ ఫేస్ ప్యాక్స్ ఇవి ఎంత ఈజీ అంటే..!

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:46 PM

టైబుల్ స్పూన్ పెరుగు కివీ పండ్లను ఒక గిన్నెలో వేసి మెత్తగా చేయాలి దీనిలో పెరుగు బాగా కలపాలి. ముఖం, మెడకు మాస్క్ ను అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ ఫ్యాక్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

kiwi Face pack : మెరిసే చర్మానికి కివీ ఫేస్ ప్యాక్స్ ఇవి ఎంత ఈజీ అంటే..!
kiwi Face pack

ముఖానికి కాంతినిచ్చే సహజమైన ఉత్పత్తుల్లో ముఖ్యంగా మార్కెట్లో దొరికే కెమికల్ ఉత్పత్తులకంటే మన ఇంట్లో వాటినే ఎక్కువగా ముఖానికి వాడుతే మంచిది. పండ్లతో వేసే ఫ్యాక్స్ ముఖానికి అందాన్ని, సహజత్వాన్ని ఇస్తాయి. వీటిలో ముఖ్యంగా విటమిన్ సి, ఇ, కె తో పాటు అనేక పోషకాలుంటాయి. ఈ పండ్లలో కివి పండునే తీసుకుంటే ఈ అన్ని విటమిన్స్ తో పాటు మొటిమలను తగ్గిస్తుంది, చర్మాన్ని తేమగా, కాంతివంతంగా, ఎక్స్ ఫోలియేషన్ వరకు వివిధ చర్మ సమస్యలను నివారిస్తుంది. కివి, తేనె, కివి పెరుగు, కివి వోట్మిల్, కివీ దోశకాయలతో వేసే ఫ్యాక్స్ చర్మానికి మంచి కాంతిని ఇస్తాయి.

కివీ మెరిసే చర్మంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కివి అనేది పోషకాలతో నిండిన పండు, ఇది విటమిన్లు సి, ఇ, కెను కలిగి ఉన్నాయి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

కివీ ఫేస్ ప్యాక్ చర్మం రూపాన్ని మార్చేస్తుంది.

డార్క్ స్పాట్స్ హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది.

మొటిమలు రాకుండా చేస్తుంది.

చర్మాన్ని మాయిశ్చరైజ్, హైడ్రేట్ చేస్తుంది.

చర్మం కాంతివంతంగా మారుతుంది.

దీనికి స్కిన్ ఎక్స్ ఫోలియేట్ చేయాలి.


Favorite Lipstick: లిప్‌స్టిక్ కలర్‌తో ఆడవారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు..!

కివి, తేనె ప్యాక్..

పండిన కివి పండును తీసుకోవాలి. టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు మాస్క్ లా వేసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచి శుభ్రం చేయాలి.

కివీ, పెరుగు ఫేస్ ఫ్యాక్..

పండిన కివీ పండు

టైబుల్ స్పూన్ పెరుగు కివీ పండ్లను ఒక గిన్నెలో వేసి మెత్తగా చేయాలి దీనిలో పెరుగు బాగా కలపాలి. ముఖం, మెడకు మాస్క్ ను అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ ఫ్యాక్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కివీ ఓట్ మిల్ ఫ్యాక్..

పండిన కివి పండు

టోబుల్ స్పూన్ వోట్మీల్

కివీ పండ్లును కడిగి గుజ్జు తీసుకోవాలి. దీనిలోకి వోట్మిల్ తీసుకోవాలి.

కివీ దోసకాయ ఫేస్ ఫ్యాక్..

పండిన కివీ పండు, దోసకాయ ముక్క

కివీ పండును మెత్తగా చేయాలి. దోసకాయ తురుము మెత్తని కివీ పండు గుజ్జు 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి.

చర్మం కాంతి వంతంగా మారేందుకు, కొన్ని రకాల అలెర్జీల నుంచి తప్పించుకునేందుకు కివీ పండు చాలా బాగా సహకరిస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 11 , 2024 | 04:47 PM