Share News

Electoral Bonds: అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి..?

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:40 PM

ఎలక్టోరల్ బాండ్స్.. రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే వివాదాస్పద యంత్రాంగం ఇది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్ధమని, ఇవి సమాచార హక్కుతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో.. వీటి గురించే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

Electoral Bonds: అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి..?

ఎలక్టోరల్ బాండ్స్.. రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే వివాదాస్పద యంత్రాంగం ఇది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్ధమని, ఇవి సమాచార హక్కుతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో.. వీటి గురించే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు ఈ బాండ్స్ ఏంటి? వీటి ఉద్దేశం ఏమిటనే విషయాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. పదండి.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎలక్టోరల్ బాండ్స్

ఎలక్టోరల్ బాండ్స్.. వ్యక్తులు లేదా సంస్థలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ఆర్థిక పరికరంగా పని చేస్తాయి. రాజకీయ పార్టీలకు నిధుల సహకారం కోసమే ఈ బాండ్‌లను ప్రత్యేకంగా జారీ చేయబడుతుంది. 2017-18 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వీటిని ప్రవేశపెట్టారు. ఈ బాండ్‌లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జారీ చేస్తుంది. వీటిని రూ.1,000, రూ.10,000, రూ.1 లక్ష, రూ.10 లక్షలు, రూ.1 కోటి గుణిజాలలో విక్రయించబడతాయి. ఈ పథకం కింద చేసే విరాళాలు 100% పన్ను మినహాయింపును పొందుతాయి. అయితే.. ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాల్ని బ్యాంక్, రాజకీయ పార్టీలు గోప్యంగానే ఉంచుతాయి.

ఈ ఎలక్టోరల్ బాండ్లను KYC ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఒక్కసారి డబ్బులు బదిలీ అయిన తర్వాత.. రాజకీయ పార్టీలు నిర్ణీత సమయంలోనే ఆ విరాళాల్ని ఎన్‌క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి లేదా సంస్థలు.. ఎలాంటి పరిమితులు లేకుండా ఎన్ని బాండ్స్ అయినా కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీమ్‌లోని నిబంధనల ప్రకారం.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించడానికి అర్హులు. అది కూడా.. లోక్‌సభ లేదా రాష్ట్ర శాసనసభకు గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1 శాతం కంటే తక్కువ ఓట్లను సాధించి ఉండకూడదు. అంటే.. కనీసం ఒక శాటం ఓట్లైనా సాధించి ఉండలనే కండీషన్ ఉంది.

ఎలక్టోరల్ బాండ్స్ & కేసు

ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని సీపీఐ(ఎం), కాంగ్రెస్‌తో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని, అవినీతిని ప్రోత్సహిస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ విరాళాలను ఎన్నికల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చని రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సైతం లేవనెత్తారు. ఈ అంశంపై గతేడాది అక్టోబర్ 31వ తేదీన విచారణ ప్రారంభమైంది. తాజాగా గురువారం నాడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి.

Updated Date - Feb 15 , 2024 | 04:40 PM