Share News

Lok Sabha Elections: మధ్యాహ్నం 3 గంటల వరకూ 49 శాతం పోలింగ్

ABN , Publish Date - May 25 , 2024 | 04:19 PM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతానికి 49.20 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్‌లో గరిష్టంగా 70.19 శాతం పోలింగ్ రికార్డయింది.

Lok Sabha Elections: మధ్యాహ్నం 3 గంటల వరకూ 49 శాతం పోలింగ్

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elctions) భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతానికి 49.20 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్‌లో గరిష్టంగా 70.19 శాతం పోలింగ్ రికార్డయింది. ఎన్నికల కమిషన్ ఓటర్ టర్నవుట్ యాప్ సమాచారం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 43.95 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలో 44.58 శాతం, బీహార్‌లో 45.21, జార్ఖండ్‌లో 54.34, జమ్మూకశ్మీర్‌లో 44.41, ఒడిశాలో 48.44, హర్యానాలో 46.26 శాతం పోలింగ్ రికార్డయింది.

Arvind Kejriwal: పాక్ మంత్రికి క్లాస్ పీకిన కేజ్రీవాల్


ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ నియోజకవర్గాలు, హర్యానాలోని 10, బీహార్‌లో 8, పశ్చిమబెంగాల్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖాండ్‌లో 4, ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరిలోనూ ఈరోజు పోలింగ్ సాగుతోంది. ఆరు విడదల పోలింగ్ అనంతరం మిగిలిన 57 లోక్‌సభ స్థానాలకు ఏడో విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న జరుగుతుంది. దీంతో ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Read National News and Latest News here

Updated Date - May 25 , 2024 | 04:19 PM