Share News

State Chief Electoral Officer: ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు..

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:35 AM

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Chief Election Officer Satya Pradasahu) ఆకస్మికంగా దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

State Chief Electoral Officer: ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు..

చెన్నై: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Chief Election Officer Satya Pradasahu) ఆకస్మికంగా దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రెండు రోజులు అక్కడే మకాం వేసి పార్లమెంటు ఎన్నికల నిర్వహణ, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, నిఘా అధికారుల నియామకం, రాజకీయపార్టీలు ప్రకటించే అభ్యర్థుల ప్రచారం, పోలింగ్‌కు అవసరమైన ఈవీఎం, వీవీ పాట్‌, భద్రతకు సాయుధ పోలీసులతో కలసి పారా మిలిటరీ బలగాలను వినియోగించుకోవడం తదితర అంశాలపై సత్యప్రదసాహు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారులతో చర్చిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 14 , 2024 | 11:35 AM