Share News

Special buses: 17, 18 తేదీల్లో 2,000 ప్రత్యేక బస్సులు.. దేనికోసమంటే...

ABN , Publish Date - Mar 30 , 2024 | 10:04 AM

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్‌ 17,18 తేదీల్లో 2,000 ప్రత్యేక బస్సులు నడుపన్నుట్లు రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రకనటలో తెలియజేసింది.

Special buses: 17, 18 తేదీల్లో 2,000 ప్రత్యేక బస్సులు.. దేనికోసమంటే...

చెన్నై: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్‌ 17,18 తేదీల్లో 2,000 ప్రత్యేక బస్సులు నడుపన్నుట్లు రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రకనటలో తెలియజేసింది. ఈ మేరకు ఆ శాఖ విడుదల చేసిన ప్రకటనలో... 100 శాతం ఓటింగ్‌ నమోదయ్యేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టిందన్నారు. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు స్వగ్రామాలకు వెళ్లేవారి సౌకర్యార్ధం రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 17,18 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపున్నామని తెలిపింది. నగరం నుంచి ప్రధాన నగరాలు, జిల్లాలకు 2,000 ప్రత్యేక బస్సులు నడుపునున్నామని తెలిపింది. ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 60 రోజులు ముందుగా రిజర్వేషన్‌ చేసే వసతి కల్పించడంతో ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది.

Updated Date - Mar 30 , 2024 | 10:04 AM