Share News

Ration employees: 25నుంచి రేషన్‌ ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:44 PM

తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈనెల 25వ తేది నుంచి రేషన్‌ ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 4,500 ప్రాథమిక వ్యవసాయ సహకార రుణ సంఘాల ద్వారా 32,000 రేషన్‌ దుకాణాలు పని చేస్తున్నాయి.

Ration employees: 25నుంచి రేషన్‌ ఉద్యోగుల సమ్మె

చెన్నై: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈనెల 25వ తేది నుంచి రేషన్‌ ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 4,500 ప్రాథమిక వ్యవసాయ సహకార రుణ సంఘాల ద్వారా 32,000 రేషన్‌ దుకాణాలు పని చేస్తున్నాయి. రేషన్‌ ఉద్యోగులు(Ration employees) సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటింటికి వెళ్లి, కార్డుదారుల వేలిముద్రల నమోదు చేయాలని నిర్బంధం చేస్తున్నారని, ఈ ప్రక్రియ రద్దు చేయాలని, పంట రు ణాల చెల్లింపులో నిబంధనలు ఉల్లంఘించారని, మాజీ ఉద్యోగులకు పదవీ విమరణ రాయితీలు అందించకుం డా వేధిస్తున్నారని, పింఛన్‌ అందించాలని తదితర డిమాండ్ల సాధనకు ఈనెల 11వ తేది జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు, అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 25వ తేది నుంచి సమ్మె చేపడతామని సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు నోటీసు అందజేసినట్లు రేషన్‌ ఉద్యోగుల సంఘాల సమాఖ్య తెలిపింది.

Updated Date - Mar 04 , 2024 | 12:44 PM