Share News

Rajinikanth: అయోధ్య వెళ్లనున్న రజనీకాంత్‌.. కుంభాభిషేక ఘట్టానికి హాజరు

ABN , Publish Date - Jan 06 , 2024 | 09:12 AM

అయోధ్య శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ఆహ్వానం మేరకు రామాలయ కుంభాభిషేక ఘట్టానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) హాజరుకానున్నారు.

Rajinikanth: అయోధ్య వెళ్లనున్న రజనీకాంత్‌.. కుంభాభిషేక ఘట్టానికి హాజరు

అడయార్‌(చెన్నై): అయోధ్య శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ఆహ్వానం మేరకు రామాలయ కుంభాభిషేక ఘట్టానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) హాజరుకానున్నారు. ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా ట్రస్ట్‌ నిర్వాహకులు స్వయంగా రజనీకాంత్‌కు ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈనెల 22న జరిగే అయోధ్య రామాలయ కుంభాభిషేక ఘట్టంలో రజనీ పాలుపంచుకోనున్నారు. ఇందుకోసం ఆయన ఈనెల 21న అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి లతా, సోదరుడు సత్యనారాయణ కూడా వెళ్లనున్నారు. ఈ వేడుక ముగిసిన తర్వాత 23న ఆయన చెన్నైకి రానున్నారు. కాగా, ఈ కుంభాభిషేక ఘట్టానికి దేశవ్యాప్తంగా 8 వేల మందిని ఆహ్వానించిన విషయం తెల్సిందే. వీరిలో 3500 మంది సన్యాసులున్నారు. ఈ 8 వేల మందికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బసతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించనుంది.

Updated Date - Jan 06 , 2024 | 09:12 AM