Share News

Girl Child: ముఖ్యమంత్రి ఇంట జన్మించిన మహాలక్ష్మీ.. ఆనందంలో సీఎం దంపతులు

ABN , Publish Date - Mar 28 , 2024 | 04:09 PM

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గురుప్రీత్ కౌర్ దంపతుల ఇంట మహాలక్ష్మి జన్మించింది. వారికి గురువారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని సీఎం మాన్ తన ఎక్స్ అకౌంట్లో పంచుకున్నాడు.

Girl Child: ముఖ్యమంత్రి ఇంట జన్మించిన మహాలక్ష్మీ.. ఆనందంలో సీఎం దంపతులు

పంజాబ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గురుప్రీత్ కౌర్ దంపతుల ఇంట మహాలక్ష్మి జన్మించింది. వారికి గురువారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని సీఎం మాన్ తన ఎక్స్ అకౌంట్లో పంచుకున్నాడు. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన తన ఎక్స్‌లో “దేవుడు మాకు కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు” అని రాసుకొచ్చారు.

కుమార్తె ఫొటోను ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. మాన్.. 2022లో గుర్‌ప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇదివరకే ఇంద్రప్రీత్ కౌర్‌తో వివాహం జరిగింది. గురుప్రీత్ కౌర్‌తో ఆయనది రెండో వివాహం. ఇంద్రప్రీత్ కౌర్‌కి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Delhi: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. రోజువారీ వేతనం పెరిగిందోచ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

మాన్, ఇంద్రప్రీత్ 2015లో విడాకులు తీసుకున్నారు.అనంతరం 2022లో గురుప్రీత్ కౌర్‌ని పెళ్లి చేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు మాన్ హాస్యనటుడిగా, గాయకుడిగా పేరు సంపాదించారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరికి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.

శుభాకాంక్షలు తెలిపిన కేజ్రీవాల్..

ఆప్ నేత, సీఎం భగవంత్ మాన్‌ దంపతులకు కుమార్తె జన్మించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులిద్దరూ ఆరోగ్యకర జీవితం గడుపుతూ.. ఎప్పటికీ ప్రజా సేవ చేయాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ సందర్భంగా జైలు నుంచే ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 04:20 PM